హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సాంసృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవితకాలం కృషి చేసిన తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ మానవీయ పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా మరో నిర్ణయం తీసుకొన్నది. ప్రఖ్యాత ఫొటో జర్నలిస్టు, చిత్రకారుడు దివంగత భరత్భూషణ్ కుటుంబానికి అండగా నిలిచింది. భరత్ భూషణ్ కుటుంబం పేదరికాన్ని చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్.. వారికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేయాలని మంత్రి కేటీఆర్కు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో హైదరాబాద్లోని జియాగూడలో భరత్ భూషణ్ సతీమణి సుభద్రమ్మ పేరుమీద డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తూ తెలంగాణ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. పెద్ద దికును కోల్పోయిన వారి కుటుంబానికి తానున్నానంటూ భరోసానిచ్చింది. గతంలో భరత్ భూషణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి ఆరోగ్యనిధి నుంచి ప్రభుత్వం చేయూతనందించిన విషయం తెలిసిందే. కాగా, తమను కష్టకాలంలో ఆదుకొంటూ, తాజాగా డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి మరోసారి అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తోపాటు తెలంగాణ సర్కారుకు భరత్ భూషణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
బతుకమ్మ భరత్ ‘భూషణం’
తెలంగాణ సంసృతిని ప్రతిబింబించే ఫొటోలు అనగానే గుర్తుకు వచ్చే పేరు భరత్ భూషణ్. ఆయన దగ్గర ఎలాంటి సందర్భానికి సంబంధించిన ఫొటో కావాలన్నా లభించేది. బతుకమ్మ, బోనాలు సహా పలు తెలంగాణ పండుగలు, పల్లె వాతావరణం, సాంస్కృతిక జీవన చిత్రాల ఫొటోలకు భరత్భూషణ్ ఓ లైబ్రరీగా ఉండేవారు. ప్రజాకవి కాళోజీ సహా ఎంతోమంది కవులు, రచయితల పుస్తకాలపై భరత్ భూషణ్ ఫొటోలు ముఖచిత్రాలుగా ముచ్చటగొలిపాయి. బతుకమ్మ ఫెస్టివల్ను డాక్యుమెంట్ చేసి తెలంగాణ సంస్కృతిపై తనకున్న మక్కువను చాటుకొన్నారు.
రాష్ట్ర తొలి ఉత్తమ ఫొటోగ్రాఫర్ భరత్
2015 జూన్ 2న జరిగిన తెలంగాణ రాష్ట్ర మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భరత్భూషణ్కు ‘ది బెస్ట్ ఫోటో జర్నలిస్టు అవార్డు’ ఇచ్చి సత్కరించింది. భరత్ భూషణ్ తన జీవిత కాలంలో ఫొటో ఎగ్జిబిషన్లు, ఆర్ట్ షోలు ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నారు. సహజమైన వెలుగులో లైట్లు లేకుండా ఫొటోలు తీయడం భరత్ భూషణ్ ప్రత్యేకత. ఫొటో జర్నలిస్టుగా అనేక మ్యాగజైన్లకు ఫ్రీలాన్సర్గా పనిచేశారు. ఫిల్మ్ మ్యాగజైన్ ‘చిత్రభూమి’, ‘ఆదివారం’ మ్యాగజైన్లలో రెగ్యులర్ ఉద్యోగిగా ఉన్నారు. చిత్రకారుడైన భరత్భూషణ్ తెలుగు, ఇంగ్లిష్లో పలు వ్యాసాలు కూడా రాశారు. వందలాది బొమ్మలు గీశారు. సినిమా రంగంలోనూ సేవలందించారు. 1980 ప్రాంతంలో వచ్చిన ‘మా భూమి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా, స్టిల్ ఫొటోగ్రాఫర్గా పనిచేశారు.
ఎవరీ భరత్భూషణ్?
భరత్ భూషణ్ 1953లో వరంగల్ నగరంలోని గిర్మాజిపేటలో జన్మించారు. ఆయన విలక్షణమైన శైలి కలిగిన ఫొటోగ్రాఫర్. ఫొటోగ్రఫీని పెయింటింగ్లాగా భావించేవారు. నాలుగు దశాబ్దాలపాటు వినూత్న శైలితో ఫొటోగ్రఫీలో విశేష సేవలందించారు. తెలంగాణ సంస్కృతి, గ్రామీణ జీవన స్థితిగతులపై అనేక ఫొటో ప్రదర్శనలిచ్చి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. తెలంగాణ సంసృతిపై మకువతో వందలాది ఫొటోలు తీసి భరత్ భూషణ్ కీర్తి గడించారు. తెలంగాణ సాంస్కృతిక, సామాజిక జీవన చిత్రానికి భరత్ భూషణ్ ఫొటోలు కేరాఫ్ అనడం అతిశయోక్తికాదు. నాలుగు దశాబ్దాలపాటు కలర్ ఫొటోగ్రఫీలో విశేష ప్రశంసలందుకొన్నారు.