హైదరాబాద్ : దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు మరోమారు పొడిగించబడింది. దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఆగస్టు 4న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనున్నట్లు చెప్పారు. ఆగస్టు 5 నుంచి 18 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు అవకాశం అన్నారు. ఆగస్టు 25న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు నేటి వరకు 1.88 లక్షల రిజిస్ట్రేషన్లు జరగగా 1.56 లక్షల మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.