హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): నల్లగొండ ఎంపీ టికెట్ను శానంపూడి సైదిరెడ్డికి ఇవ్వొద్దని నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కిసాన్సెల్ మాజీ అధ్యక్షుడు గోలి మధుసూదన్రెడ్డి, సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, గార్లపాటి జితేందర్, తంగిడి మనోహర్రెడ్డి తదితరులు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ ఎదుట తమ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోవడమేకాకుండా, రాత్రికి రాత్రే పార్టీ మారిన నేతకు టికెట్ ఇవ్వడం సరికాదని చెప్పారు. బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నల్లగొండ పర్యటనకు వెళ్తే ఆయన కాన్వాయ్పై సైదిరెడ్డి రాళ్లదాడి చేయించారని ఆరోపించారు.