హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు హైదరాబాద్ జిల్లాకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. తమ ఒకరోజు మూలవేతనం రూ.11,009 సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు అందజేశారు. సికింద్రాబాద్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బీ రవీందర్రెడ్డి, అంబర్పేట స్కూల్లో ఎస్జీటీ జీవీ బదరి నారాయణరావు, సికింద్రాబాద్, బన్సీలాల్పేట మేకలమండి స్కూళ్ల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు సీహెచ్ శౌరి, కే మల్లికార్జున్రెడ్డి ఈ విరాళం ఇచ్చారు.