హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులు 24 గంటల్లో 35 మందికి డెలివరీలు చేశారు. 20 మంది మగ, 15 మంది ఆడశిశువులకు పురుడుపోశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఎంసీహెచ్ సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో డెలివరీలు చేశామని చెప్పారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ ద్వారా డాక్టర్ల బృందానికి అభినందనలు తెలిపారు. – జనగామ రూరల్