కుంటలో నుంచి మృతదేహం వెలికితీత
నీలగిరి, సెప్టెంబర్ 7: వాకింగ్ కోసం వెళ్లిన ఓ డాక్టర్ అదృశ్యం కాగా మంగళవారం అతని మృతదేహాన్ని గుర్తించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ జయశీల్రెడ్డి (42) సోమవారం ఉదయం నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో వాకింగ్ వెళ్లారు. ఆ తరువాత కన్పించకుండా పోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వ్యవసాయ క్షేత్రంలోని రెండు బావులు, చెరువు కుంటలోనూ గాలించారు. నాగార్జునసాగర్కు చెందిన గజ ఈతగాళ్లను, పానగల్ ఉదయ సముద్రంలో చేపలు పట్టే జాలర్లను పిలిపించి రాయికుంటలో గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మధ్యాహ్నం మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నల్లగొండ జనరల్ దవాఖానకు తరలించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. జయశీల్రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి సోదరుడు కావడంతో ఆయన కూడా రెండు రోజులుగా అక్కడే ఉన్నారు. కాగా బుధవారం హైదరాబాద్లోని విద్యానగర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు జయశీల్రెడ్డి బంధువులు తెలిపారు.
ప్రమాదవశాత్తు జారి పడ్డారా?
డాక్టర్ జయశీల్రెడ్డి సోమవారం తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న చెరువు కుంట అలుగు పోస్తున్న ఫొటోలు, ఇతర ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా మేనమామ కోమటిరెడ్డి వినోద్రెడ్డికి పంపారు. ఫోన్లో అతనితో కూడా మాట్లాడారు. ఈ క్రమంలో గట్టు ఎక్కే ప్రయత్నం చేశారని, షూ ఉండటంతో కాలు జారి కుంటలో పడిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో జారి పడొచ్చని కూడా అనుమానిస్తున్నారు.