హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పోలీసు సంక్షేమ పథకాలను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత విభాగాల సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించారు. పోలీస్ క్యాంటీన్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు తదితర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యంగ్ ఇండియా పోలీస్ సూల్, పిల్లల విద్య, సివిల్స్, గ్రూప్స్ కోచింగ్, సాలర్షిప్లు, వివాహ సహాయం తదితర సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని, పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్ను పెంచాలని అధికారులను డీజీపీ ఆదేశించారు.