HomeTelanganaDo Not Remain Silent On Online Harassment
ఆన్లైన్ వేధింపులపై మౌనం వద్దు!
పెద్దల దృష్టికి తేవాలని సూచిస్తున్న పోలీసులు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో వేధించే పోకిరీల విషయంలో మౌనంగా ఉండవద్దని పోలీసులు సూచిస్తున్నారు. విషయం చేయి దాటకముందే ఇంట్లోవారికి తెలియజేస్తే తగిన ఫలితం ఉంటుందని చెప్తున్నారు. పోలీసుల పలు సూచనలు..
ఇలా చేయండి
మిమ్మల్ని ఎవరైనా ఆన్లైన్లో లైంగికంగా వేధిస్తుంటే వెంటనే విషయాన్ని మీ ఇంట్లో పెద్దలు, మీకు సన్నిహితంగా ఉండేవారితో పంచుకోండి. ఎలాంటి ఆందోళన వద్దు.
మీకు పంపే మెసేజ్లు, ఇతర అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలను స్క్రీన్షాట్ తీసుకుని భద్రపరచండి. ఇవి తర్వాత ఆధారాలుగా పనికొస్తాయి.
మీకు అసభ్యకరమైన మెసేజ్లు పంపేవారిని అన్ఫ్రెండ్ లేదా బ్లాక్ చేయాలి.
మీ స్నేహితులకు సంబంధించి కూడా ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే వెంటనే వారి పెద్దల దృష్టికి తీసుకెళ్లండి. మౌనంగా ఉండవద్దు.
ఇలా చేయొద్దు
అడ్డగోలు మెసేజ్లు, అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పెట్టేవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రిైప్లె ఇవ్వవద్దు. వాటిని పట్టించుకోకపోవడమే ఎదుటివారికి అతి శక్తిమంతమైన సమాధానం అవుతుంది.
అవతలివాడికి సమాధానం ఇస్తూ వెళితే వాళ్లు మరింత రెచ్చిపోతారు.
మెసేజ్లు, ఫోన్కాల్తో బెదిరించినా సమాధానం ఇవ్వవద్దు.
ఇతరులు వేధించడాన్ని మీ తప్పుగా భావించి మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు.