హైదరాబాద్, మే 25(నమస్తే తె లంగాణ): ఆస్తిలో కూతురుకు వాటా ఇవ్వాల్సి వస్తుందని.. అసలు ఆమె తన కుమార్తెనే కాదని ఓ తండ్రి ప్రయత్నించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. తండ్రి ఆస్తిలో వాటా కోరుతూ భీమునిపట్నంకు చెందిన దింగు కనకమహాలక్ష్మి విజయనగరం కోర్టులో దావా వేశారు. దీంతో ఆమె తన కూతురు కాదని, తన అన్నకు జ న్మించిందని నరసయ్యరెడ్డి వాదించడంతోపాటు ఆమెకు డీఎన్ఏ పరీక్ష చేయాలని కో రారు.
ఈ వాదనను దిగువ కోర్టు కొట్టేసింది. తీర్పును సవాల్ చేస్తూ నరసయ్యరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ తార్లాడ రాజశేఖరరావు ఇటీవల విచారణ జరిపారు. కుమార్తె హకులను తిరసరించేందుకు డీఎన్ఏ ప రీక్ష నిర్వహించాలని కోరలేరని స్ప ష్టం చేస్తూ పిటిషన్ను కొట్టేశారు.
పితృత్వాన్ని సవాల్ చేసేందుకు డీఎన్ఏ పరీక్షను అస్త్రంగా చేసుకునే వీల్లేదని, చట్టంలో నిర్దేశించిన సాక్ష్యాలను, సమర్పించి నిరూపించుకోవాలని తీర్పు చెప్పడంతోపాటు నరసయ్యరెడ్డికి రూ.3 వేలు జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని 2 వారాల్లోగా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించారు.