హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా కొన్నేండ్లుగా కొనసాగుతూ వస్తున్న విద్యాసాగర్రెడ్డిని ఎట్టకేలకు ప్రభుత్వం పక్కకు తప్పించింది. సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి దివ్యాదేవరాజన్కు స్త్రీనిధి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు.
‘స్త్రీనిధిలో అంతా కాంట్రాక్ట్ యవ్వారమే!’ ‘పరీక్ష లేకుం డా కొలువుల పందేరం!’ ఇలా పలు శీర్షికలతో ఆ సంస్థలో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ఆర్థికశాఖ అనుమతి లేకుండా భారీ వేతనాలతో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేయడం, రోస్టర్ విధానం పాటించకపోవడం వంటి అంశాలను ప్రభు త్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. సంస్థ ఎండీ తీరుపై నిరుద్యోగ జేఏసీ నేతల నుంచి తీవ్ర విమర్శలు రావ డం, సంస్థలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనలపై ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. విద్యాసాగర్రెడ్డిని పక్కనబెట్టి దివ్యాదేవరాజన్కు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.