హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ గొర్రెలను పంపిణీ చేస్తామని గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర, జిల్లాల ప్రతినిధులు బుధవారం చైర్మన్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగానే తాము పని చేస్తున్నట్టు చెప్పారు. భేటీలో జీఎంపీఎస్ గౌరవ అధ్యక్షుడు కాసాని ఐలయ్య, అధ్యక్షుడు కిల్లె గోపాల్, ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, వివిధ జిల్లాల కార్యదర్శులు, ప్రతినిధులు ఉన్నారు.