హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ భవన్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ(టీఆర్బీ), సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం బస్ భవన్లోని 92 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఎండీ నిత్యావసర సరుకులతో పాటు శానిటైజర్స్, మాస్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(రెవెన్యూ&ఐటీ), సంస్థ కార్యదర్శి ఏ.పురుషోత్తం, సి. వినోద్ కుమార్, ఇ. యాదగిరి, రమేశ్, గంగారెడ్డి, ఎస్. కృష్ణకాంత్, టి. సూర్య కిరణ్, సుదర్శన్, జీవన్ ప్రసాద్, విజయ్ కుమార్, కిరణ్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.