ఆదిలాబాద్ : ప్రతి ఆడ బిడ్డ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని ఎల్లపల్లి గ్రామంలో ఆర్కే కన్వెన్షన్ హాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఆడ బిడ్డలందరికి బతుకమ్మ చీరెలు అందించి వారిని గౌరవించుకునేందుకు ప్రభుత్వం బతుకమ్మ చీరెల పంపిణీ చేస్తుందన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తుందన్నారు. 289 రకాల్లో సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరలు తయారు చేసారని తెలిపారు. ఈ సవత్సరం రూ.330 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీఆర్డీఏ ఇంచార్జి పీడీ డీపీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీపీ రామేశ్వర్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నర్మద తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భవానీపూర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ
WhatsApp : భారత్లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఆదాయం పెంచుతూ ప్రజలకు పంచే ప్రభుత్వం మాది : మంత్రి జగదీష్రెడ్డి