హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చేతుల మీదుగా దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి తెలిపారు. 105 మంది దివ్యాంగులకు అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో వాహనాలను సమకూర్చారు. నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు వాటిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.