తెలుగుయూనివర్సిటీ, జూలై 18: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో విచ్ఛిన్న తరహా పాలన కొనసాగిస్తున్నదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ విమర్శించారు. ప్రాజెక్టులు, నీళ్ల వ్యవహారంలో కేంద్రం జారీచేసిన గెజిట్ తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించిందని పేర్కొన్నారు. రాష్ట్ర హక్కుల కోసం విద్యార్థులు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో తలపెట్టిన చైతన్యయాత్రను ఆదివారం ఆయన గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మా ట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం దళితులను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నదని, రిజర్వేషన్ హక్కులను సైతం కాలరాస్తున్నదని విమర్శించారు. రైతాంగంపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ, వారిని అణచివేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక జేఏసీ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పా రు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఓడించాలనే నినాదంతో చేపట్టిన బస్సుయాత్రలో విద్యార్థి జేఏసీ నాయకులు బాలు, రమేశ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్కు చేరుకున్న బస్సుయాత్ర
హుజూరాబాద్ టౌన్/కమలాపూర్, జూలై 18: ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టాడని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ తుంగ బాలు, అధ్యక్షుడు తొట్ల స్వామి యాదవ్, అధికార ప్రతినిధి కడారి స్వామి విమర్శించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన విద్యార్థి జేఏసీ బస్సుయాత్ర సాయం త్రం హుజూరాబాద్కు చేరుకున్నది. అనంతరం ‘కుట్రలను ఓడిద్దాం’ పేరిట రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి వీణవంకలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరోవైపు వరంగల్అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లిలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యా ర్థి జేఏసీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.