హైదరాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన తరగతులవారీగా ఫీజులను నోటీస్బోర్డుతోపాటు.. పాఠశాల వెబ్సైట్లో స్పష్టం గా ప్రదర్శించాలని పేర్కొన్నది. ఆదేశాలను పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం హెచ్చరించారు. దీంతోపాటు పాఠశాలలన్నీ 202-24, 2024-25 విద్యాసంవత్సరాలకు సంబంధించిన వార్షిక పరిపాలన నివేదికలు, ఆడిట్ నివేదికలను ఈ నెల 30లోపు సమర్పించాలని ఆదేశించారు.