నేడు అసెంబ్లీలో చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమం, హైదరాబాద్ పాతబస్తీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం అసెంబ్లీలో చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం, జీరో అవర్ ముగిసిన తర్వాత ఈ చర్చ జరుగనున్నది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన సవరణ బిల్లుతోపాటు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లును, టూరిస్టులపై దాడులు చేసేవారిని శిక్షించే బిల్లును సభ ముందుంచనున్నారు. వీటిని ఆమోదించిన తర్వాత శాసనమండలిలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హరితహారంపై చర్చిస్తారు.