HomeTelanganaDiscussion On Facilities At Bus Stations
టీఎస్, ఏపీ ఆర్టీసీ చైర్మన్ల భేటీ
హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో బస్ స్టేషన్లలో పరస్పర సదుపాయాల ఏర్పాట్లపై టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున్రెడ్డి చర్చించారు.
బస్ స్టేషన్లలో సదుపాయాలపై చర్చ
హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో బస్ స్టేషన్లలో పరస్పర సదుపాయాల ఏర్పాట్లపై టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున్రెడ్డి చర్చించారు. నగరంలోని కుందన్బాగ్లో చైర్మన్ బాజిరెడ్డి అధికారిక నివాసంలో ఇరువురు మార్యదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడ పండిట్ నెహ్రూ ప్రధాన బస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ బస్సుల పార్కింగ్, బస్ స్టేషన్ వద్ద ప్లాట్ ఫామ్ల కేటాయింపు, అదేవిధంగా హైదరాబాద్ -విజయవాడ రూట్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసుల ఏర్పాటుపై ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి టీఎస్ఆర్టీసీ నుంచి బస్సు సర్వీస్లతోపాటు ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణికుల రవాణాకు తగిన సదుపాయాల కల్పనకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ తీసుకోవాల్సిన చర్యలు చర్చకు వచ్చాయయి. ఈ భేటీ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డిని బాజిరెడ్డి గోవర్ధన్ శాలువా కప్పి సత్కరించారు.