హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ అంశాన్ని మంగళవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశమున్నది. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన ప్రాథమిక విచారణ నివేదికను అందజేసింది. మరోవైపు కాగ్ నివేదిక, ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా విచారణ కొనసాగించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో కూడా ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేయించాలని నిర్ణయించింది. విచారణాంశాలు, విధివిధానాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.