హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ రెడ్కో) బోర్డులో డైరెక్టర్లుగా డిస్కంల సీఎండీలను నియమించింది. ఈ మేరకు గురువారం ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎఎం రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ ఎంఎ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కే వరుణ్రెడ్డిలు ఇకపై రెడ్కో బోర్డు డైరెక్టర్లుగా ఉంటారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని రెడ్కో వీసీఎండీని ఆదేశించారు.