హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ, జవాబుదారీతనం పారదర్శకతకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం శాఖ డైరెక్టర్ హనమంతరావుతో కలిసి తన చాంబర్ నుంచి జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సోషల్ ఆడిట్, పెండింగ్ పేరాలు, వాటి డ్రాఫ్టింగ్ విధివిధానాలపై కలెక్టర్లకు అవగాహన కల్పించారు. పెం డింగ్ పేరాల విషయంలో మందలించి వదిలేయకుండా అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. స్త్రీనిధి, సెర్ప్ బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని, తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి, ఎన్పీఏ లేకుండా చూడాలని చెప్పారు.