హైదరాబాద్: నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో (national police academy) 73వ బ్యాచ్ శిక్షణ పూర్తిచేసుకున్నది. ఈ సందర్భంగా ఐపీఎస్ (IPS) అధికారులు నేడు దీక్షాంత్ సమారోహ్ (Dikshant Parade) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఐపీఎస్ శిక్షణార్థుల నుంచి దోవల్ గౌరవ వందనం స్వీకరిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి అవార్డులు ప్రదానం చేస్తారు. 73వ బ్యాచ్లో మొత్తం 149 మంది శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఇందులో 27 మంది మహిళా ఐపీఎస్లు ఉన్నారు.