హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన దీకొండ నర్సింగరావును జాతీయ మానవ హక్కుల కమిషన్ వారు స్వచ్ఛంద ప్రాతిపదికన తెలుగు అనువాదకుడిగా ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన (16) మంది భాషా కోవిదులు కమిషన్ సేవలకు స్వచ్ఛంద అనువాదకులుగా ఎంపికయ్యారు.
కన్నడ (1), తమిళ(5), తెలుగు(1), మరాఠీ (1), పంజాబీ (5), గుజరాతీ (2), ఒరియా (1) వంటి ప్రాంతీయ భాషల నుంచి వచ్చే ఫిర్యాదులు, విజ్ఞాపనలను ఇంగ్లీషులోకి, ఇంగ్లీషు నుంచి ప్రాంతీయ భాషలలోకి వీరు తర్జుమా చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అర్థ గణాంక శాఖలో ఉప గణాంకాధికారిగా పని చేస్తున్న దీకొండ ప్రభుత్వ సలహాదారు డా.జి.ఆర్.రెడ్డి వద్ద డేటా సహాయకులుగా ఉన్నారు.