సిమ్లా, జూలై 15: కాంగ్రెస్ పాలిత హిమాచల్ప్రదేశ్లో డీజిల్ ధరలు పెరిగాయి. డీజిల్పై రూ.3 వ్యాట్ను పెంచుతున్నట్టు శనివారం ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు వెల్లడించారు. ఈ నిర్ణయంతో డీజిల్పై వ్యాట్ రూ.10.40కు చేరుకున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న 9.90 శాతం వ్యాట్ 13.90 శాతానికి పెంచుతున్నట్టు ఆ రాష్ట్ర పన్నుల శాఖ తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ర్టాలతో పోలిస్తే హిమాచల్ప్రదేశ్లో డీజిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని సీఎం సుఖు ధరల పెరుగుదలను సమర్థించుకున్నారు.