నిర్మల్ : యువతీ యువకులకు ధ్యాన్ చాంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని (ధ్యాన్ చంద్ జయంతి) జిల్లా హాకీ అసోసియేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ధ్యాన్ చంద్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప ఆటగాడు ధ్యాన్ చంద్ అన్నారు. పేద కుటుంబంలో పుట్టి దేశానికి ఒలింపిక్స్ లో ఎన్నో బంగారు పతకాలు సాధించి పెట్టాడని ప్రశంసించారు.
ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉంటామన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి ని పెంచేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం పాకల ఫౌండేషన్ కన్వీనర్ పాకాల రాంచందర్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడల్లో గెలిచిన క్రీడాకారులను సత్కరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్,
మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక వెంకట రమణ, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, అల్లోల మురళీధర్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆకోజి కిషన్, సుదర్శన్, హకీ కార్యదర్శి నిర్మల్ జిల్లా, వ్యాయామ ఉపాధ్యాయుడు కే భోజన్న స్కూల్ గేమ్స్ పీడీలు భూమన్న, లక్ష్మణ్, అన్నపూర్ణ, స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎం శ్రీనివాస్, పాల్గొన్నారు.