తిరుమలగిరి (సాగర్), ఏప్రిల్ 16: నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం అల్వాల గ్రామానికి చెందిన పెంకీస్ ధీరజ్రెడ్డి సివిల్స్లో ఆలిండియా 173వ ర్యాంకును సాధించాడు. పెంకీస్ సత్యనారాయణరెడ్డి హేమలత కుమారుడైన ధీరజ్రెడ్డి మూడో ప్రయత్నంలో విజయం సాధించడంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.
‘ఈ ర్యాంక్తో నాకు ఈ సారి ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ వస్తుంది. ఉద్యోగం చేసుకుంటూనే తిరిగి సివిల్స్కు ప్రిపేర్ అయి ఐఏఎస్ సాధిస్తా’ అని ధీరజ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.