మారేడ్పల్లి, జూలై 28: దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న రైల్వే కాంట్రాక్ట్ కా ర్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని హైదరాబాద్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అ ధ్యక్షుడు ఎం వెంకటేశ్ డిమాండ్ చేశారు. రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సికింద్రాబాద్ రైల్నిలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.
అనంతరం రైల్వే జీఎం కార్యదర్శి ముత్యాలనాయుడుకు వినతిపత్రం ఇచ్చారు. వెంకటేశ్ మాట్లాడుతూ.. అవు ట్ కమ్ బేసిక్ టెండర్ విధానం రద్దు చేయాలని, ప్రతినెలా 7వ తేదీలోగా వేతనాలు ఇవ్వాలని, ఈఎల్లు 18, సీఎల్లు 12, జాతీయ, పండుగ సెలవులు 12 చొప్పున ఇవ్వాలని, ఒక నెల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని కోరారు. ఒకరోజు విధులకు హాజరుకాకుంటే 2 రోజుల వేతనాల కోతను నిలిపేయాలని, రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ల వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైల్వే సీనియర్ నాయకులు శివకుమార్, సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు జే కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.