యాదాద్రి, డిసెంబర్ 16: స్వయం భూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం మొదటి సారిగా జరుగుతున్న ధనుర్మాసోత్సవాలకు శుక్రవారం సాయంత్రం 6.17 గంటలకు ప్రధానార్చక బృందం శ్రీకారం చుట్టింది. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో గోదాదేవికి ఆరాధన, అష్టోత్తరం చేపట్టి సేవకాలాన్ని ప్రారంభించారు. అనంతరం ధనుర్మాస విశిష్టత, పాశురాల పరమావధి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. 30 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.21,30,471 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.