జహీరాబాద్, మే 29: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో ఒగ్గి సిద్ధన్న.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 200 బస్తాల సోయాబీన్ విత్తనాలు తీసుకువచ్చి ఇంట్లో అక్రమం గా నిల్వ చేశాడు. పక్కా సమాచారంతో మొగుడంపల్లి వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్, చిరాగ్పల్లి ఎస్సై కాశీనాథ్ సోమవారం ఒగ్గి సిద్ధన్న ఇంట్లో తనిఖీలు చేయగా హీరా కంపెనీ పేరుతో ఉన్న 200 బస్తాల సోయాబీన్ విత్తనాలు లభించాయి. ప్రభుత్వ అనుమతి లేకుం డా ఇంట్లో నిల్వ చేసిన విత్తనాల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
ఒగ్గి సిద్ధన్నపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పలువురు వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి విత్తనాలు తెచ్చి రైతులకు విక్రయిస్తున్నట్టు గుర్తించామని వ్యవసాయాధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు, విత్తన వ్యాపారుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.