ఆదిలాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మావోయిజం అంతరించిందని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తగ్గిస్తున్న గ్రేహౌండ్స్ బలగాలను ఆహార కల్తీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్తోపాటు ఇతర విధులకు వినియోగిస్తామని పేర్కొన్నారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గంజాయి సాగు ఎక్కువగా ఉన్నదని, గంజాయి సాగుచేస్తున్న 110మంది రైతులకు రైతుభరోసా నిలిపివేశామని తెలిపారు. 44జాతీయ రహదారిపై ప్రమాదాలు సంఖ్య పెరుగుతున్నదని, దీనిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.