హైదరాబాద్ : కెనడాలో జరిగిన వరల్డ్ గేమ్స్లో తెలంగాణ పోలీస్ అధికారి పతకాలు సాధించడం తెలంగాణ పోలీసుకు గర్వకారణమని డీజీపీ అనిల్కుమార్ (DGP Anjani Kumar) అన్నారు. జులై 28 నుంచి కెనడా (Canada)లోని విన్నిపెగ్లో వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ – 2023 ( World Police And Fire Games)లో పోటీలు జరిగాయి.
ఈ పోటీల్లో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్లో పాల్గొని పతకాలు సాధించిన రాచకొండ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, రోడ్ సేఫ్టీ వింగ్ అధికారిణి శ్రీబాల (Sribala)ను మంగళవారం డీజీపీతో పాటు వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ ఏడీజీపీ అభిలాషా బిష్త్, లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ కుమార్ జైన్ సత్కరించారు. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో పాల్గొన్న ఏకైక తెలంగాణ పోలీసు క్రీడాకారిణి ఆమె అని డీజీపీ ప్రశంసించారు. ఆమె అసాధారణమైన నిబద్ధత, పోటీలో ప్రదర్శించిన కృషి వల్ల ఆమె పతకాలు సాధించిందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల నుంచి 8,000 మంది పోలీసు, అగ్నిమాపక అథ్లెట్లు 60 కంటే ఎక్కువ క్రీడలలో పోటీ పడ్డారని వివరించారు. టేబుల్ టెన్నిస్ (Table Tennis)లో బి శ్రీబాల 40 ప్లస్ మహిళల డబుల్స్లో రజత పతకాలు, 40 ప్లస్ మిక్స్డ్ డబుల్స్లో, 40 ప్లస్ మహిళల సింగిల్స్లో కాంస్య పతకాలను గెలుచుకుందని వెల్లడించారు.
బ్యాడ్మింటన్ ( Badminton) లో 40 ప్లస్ మహిళల సింగిల్స్లో బంగారు పతకం, మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకుందని అన్నారు. మొత్తంగా, ఆమె భారతదేశానికి ఒక స్వర్ణం , రెండు రజత, కాంస్య పతకాలతో సహా ఐదు పతకాలను గెలుచుకుందని డీజీపీ పేర్కొన్నారు. గత యేడాడి రోటర్డామ్లో జరిగిన పోటీల్లోనూ రజత, కాంస్యపతకాలను సాధించిందని అన్నారు.