హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అగ్నిమాపకశాఖ రూ.5 కోట్లతో నూతన యంత్ర, సామగ్రిని సమకూర్చుకోనున్నట్టు ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ విభాగంలో పనిచేసే సిబ్బందికి రెస్క్యూ పరికరాలను త్వరలోనే కొనుగోలు చేస్తామని చెప్పారు. గురువారం హైదరాబాద్లో ఫైర్ ఎక్విప్మెంట్ డెమో కార్యక్రమం జరిగింది.
ఇందులో పలు కంపెనీలకు చెందిన బోట్లు, ఏరియా లైటింగ్ సిస్టమ్, టార్చ్లైట్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ, కట్టింగ్ సామగ్రి, రోప్ కిట్లు, టెలీస్కోపిక్ పరికరాలు, హెల్మెట్లు, వైర్లెస్ సిస్టమ్వంటి వివిధ పరికరాలను పరీక్షించినట్లు నాగిరెడ్డి తెలిపారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఎస్డీఆర్ఎఫ్ బృందానికి ఈ పరికరాలు ఉపయోగకరంగా ఉంటాయని, బాధితులను త్వరగా రక్షించే వీలుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఫైర్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ నారాయణరావు, డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.