హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రచయిత, కాలమిస్టు, తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు ఆరోగ్యం విషమంగా మారింది. 83 ఏండ్ల ప్రభాకర్రావు తీవ్ర అస్వస్థతతో గత మార్చి 31 నుంచి హైదర్గూడ అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రభాకర్రావు గత ఏడాది నవంబర్ నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆయన కుమారుడు శనివారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ప్రభాకర్రావు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని వెల్లడించారు. ప్రభాకర్రావు పూర్వం గోల్కొండ పత్రికలో సంపాదకీయాలు రాశారు. రచయితగా అనేక పుస్తకాలు రచించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన పాలుపంచుకొన్నారు.