సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏడో ఆదివారం సందర్భంగా 35 వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొన్నారు. స్వామి వారికి అభిషేకాలు, పట్నాలు, అర్చన, పూజలు నిర్వహించారు. ఒడి బియ్యం, కేశ ఖండన చేసుకొని గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకొన్నారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, జనగామ, మెట్పల్లి ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాల్రాజు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు మల్లన్నను దర్శించుకొన్నారు.
-చేర్యాల