వేములవాడ : మేడారం జాతర సమీపిస్తున్నందున వేముల రాజన్నకు భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది.
ఉదయం నుంచే స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లలో దాదాపు 2 గంటల పాటు నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ప్రీతి మొక్కైన కోడె మొక్కు చెల్లించుకున్నారు.
రాజన్న అనుబంధ దేవాలయావద్ద కూడా భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం దాదాపు గంట పాటు నిలబడి దర్శించుకున్నారు.
వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.23 లక్షల ఆదాయం సమకూరిందని, రాజన్నను దాదాపు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.