నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 9: దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడో రోజు శనివారం వేములవాడలోని రాజన్న ఆలయంలో అమ్మవారు, బాసరలోని సరస్వతీ అమ్మవారు, శ్రీశైలంలోని భ్రమరాంబదేవి, అలంపూర్లోని జోగులాంబ దేవీ చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీలక్ష్మీ తాయారు అమ్మ వారు ధనలక్ష్మిగా భక్తులకు సాక్షాత్కరించారు.