దుబ్బాక, ఆగస్టు 20: ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్ర భుత్వాలు ఆలయాల ఆదాయాన్ని వాడుకుంటే.. స్వ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ నిధులతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చుపెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ముఖ్య అతిథులుగా చినజీయర్స్వామి, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. దేవుడి ఆశీస్సులతో తెలంగాణ అన్నిరంగాల్లో ప్రగతిపథంలో ప యనిస్తుందని పేర్కొన్నారు. 2009లో దుబ్బాకలో వేంకటేశ్వరాలయ నిర్మాణం చేపట్టిన సమయంలో ఈ ప్రాంతం కరువు కాటకాలు, ఆకలి కేకలు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉండేదన్నారు. ఇప్పుడు గోదవరి జలాలతో ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో ఆకుపచ్చగా కనిపిస్తున్నదని చెప్పారు.
భగవంతుడి ముందు అందరూ సమానమే: చిన జీయర్స్వామి
భగవంతుడి ముందు అందరూ సమానమేనని, దేవాలయాలను పూజల కోసం కాకుండా సమతాభావాన్ని పెంపొందించేందుకు సద్వినియోగం చేసుకోవాలని త్రిదండి చినజీయర్ స్వామి సూచించారు. మతం పేరిట ఆధిపత్యానికి పాకులాడితే పతనం తప్పదని చెప్పారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్లో అదే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని అభినందించారు. తెలంగాణలో సాగు, తాగునీటి కష్టాలు తీరాయని, పశువుల అభివృద్ధి, వాటి పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించి సుందర తెలంగాణగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా దుబ్బాకలో నిర్మించిన బాలాజీ దేవాయ స్థ్థపతి వల్లినాయిగంను బంగారు కంకణంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, కార్యదర్శి చింత రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.