మునుగోడు : రాష్ట్రంలో ముదిరాజ్ల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వైపే మునుగోడు ముదిరాజ్లంతా ఉన్నారని శాసనమండలి సభ్యులు బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మునుగోడు మండలం కొంపల్లి ఎంపీటీసీ పరిధిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వం ముదిరాజ్ల ఆత్మగౌరవం కోసం కోకాపేటలో ముదిరాజ్లకు ఏడు అంతస్థుల భవన నిర్మాణం చేపడుతుందని పేర్కొన్నారు. ముదిరాజ్ల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు. రాజీనామాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అనుకుంటే ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏనాడు కూడా ముదిరాజ్ పేరు పెట్టుకొని ఉచ్చరించని నాయకులు హుజూరాబాద్ ఎన్నికల్లో ముదిరాజ్ లమని గుర్తు చేశారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్, మహాసభ యువత అధ్యక్షుడు బోళ్ళ వెంకట్ ముదిరాజ్, రాష్ట్ర యువత అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, యువత ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, కోఆర్డినేటర్ బొక్క శ్రీనివాస్ ముదిరాజ్ ,ఉపాధ్యక్షుడు ఆకుల రాజేశ్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు దమ్మి గారి కనకయ్య ముదిరాజ్, బైరి బలరాం ముదిరాజ్, గ్రామ శాఖ అధ్యక్షుడు సూర శంకర్ ముదిరాజ్, నారగోని నర్సింహ ముదిరాజ్ పాల్గొన్నారు.