హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర నడిబొడ్డున కూకట్పల్లి వై-జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల భూమిపై పూర్తిహక్కులు దేవాదాయ శాఖ పరిధిలోని ఉదాసీన్ మఠానికే చెందుతాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు ఉదాసీన్ మఠం వర్సెస్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (ఐడీఎల్ కెమికల్స్) కేసులో గత మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.15వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కూకట్పల్లి వై-జంక్షన్ వద్దగల తమ భూములను 1964, 1966, 1969, 1978లో నాలుగు దఫాలుగా ఐడీఎల్ ఇండస్ట్రీ బఫర్జోన్ కోసం 99 ఏండ్లకు 2వ పేజీలోదేవాదాయశాఖవే 540 ఎకరాలు ఉదాసీన్ మఠం లీజుకిచ్చింది. బఫర్జోన్ కింద ఉన్న ఈ భూముల్లో 538 ఎకరాల విస్తీర్ణంలో గల్ఫ్ ఆయిల్ కా ర్పొరేషన్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించింది.
దీన్ని సవాల్ చేస్తూ ఉదాసీన్ మఠం దేవాదాయ శాఖ ట్రి బ్యునల్ను ఆశ్రయించింది. పిటిషన్ను విచారించిన ట్రిబ్యునల్ 2011లో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కు ఇచ్చిన లీజును రద్దుచేసింది. దీన్ని సవాల్చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, 2013లో ఆ పిటిషన్నూ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీనిపై గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2013 నుంచి స్టేటస్కో మెయింటైన్ చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. గత మంగళవారం తుది తీర్పును వెలువరించింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ పిటిషన్ను కొట్టిపారేస్తూ.. ఆ భూములపై పూర్తిహక్కు దేవాదాయశాఖ పరిధిలోని ఉదాసీన్ మఠానికే ఉన్నదని ప్రకటించింది.
దేవాదాయ శాఖకు అనుకూలంగా తీర్పు వెలువడటంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. విలువైన భూములను కాపాడేందుకు సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన దేవాదాయశాఖ అధికారులు, న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ తీర్పు ద్వారా దేవుడి మాన్యాలపై పూర్తిహక్కు దేవాదాయ సంస్థలకు మాత్రమే ఉన్నదంటూ సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంచేసినట్లయ్యిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆక్రమణలో ఉన్న దేవాదాయశాఖ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని సూచించారు.