చేగుంట, ఆగస్టు 18: లంచం తీసుకొంటూ మెదక్ జిల్లా చేగుంట డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్కు చెందిన రఘునాథ్రెడ్డి చేగుంట మండలం గొల్లపల్లిలో ఏడాది క్రితం తొమ్మిది ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందులో మూడెకరాలు వేరే వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంతోపాటు మిగిలిన భూమిలో 30 గుంటలు ఫౌతి కోసం, ఎకరా రిజిస్ట్రేషన్ కోసం రఘునాథ్రెడ్డి డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ను సంప్రదించారు. ఇందుకు ఆయన రూ.5 లక్షలు డిమాండ్ చేశా డు. చివరకు రూ.2.70 లక్షలకు అంగీకరించాడు. గురువారం చంద్రశేఖర్ తరఫున మధ్యవర్తి అనిల్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు.