హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రేపటి నుంచి అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు శాఖలు ప్రభుత్వ ప్రాధాన్యానికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపాయి.
ఆయా శాఖలన్నీ తమ ప్రతిపాదనల్లో ఆరు గ్యాంరెటీలకు అధిక ప్రాధా న్యం ఇచ్చినట్టు తెలిసింది. రోజుకు ఇద్దరు మంత్రులు, సంబంధిత శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశాలు నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్కు వెళ్తుందా లేదంటే పూర్తిబడ్జెట్ను ప్రవేశపెడుతుందా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.