హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణకు ఏర్పాటుచేసిన నూతన వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) కసరత్తును ప్రారంభించింది. ఫిట్మెంట్పై సోమవారం నుంచి శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనున్నది. ఈ మేరకు 5, 6 తేదీల్లో హోంశాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం కానుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయా విభాగాల అధికారులకు పీఆర్సీ కమిటీ సమాచారాన్నిచ్చింది. బీఆర్కే భవన్లోని ఏడో అంతస్థులో కాన్ఫరె న్స్ హాల్లో హెచ్వోడీలతో పీఆర్సీ కమి టీ సంప్రదింపులు జరపనుంది. ఉద్యోగుల వేతన సవరణకు వీలుగా కేసీఆర్ ప్రభుత్వం నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయగా, ఎన్నికల కోడ్తో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా పీఆర్సీ తన పనిని ప్రారంభించింది.