హైదరాబాద్ సిటీబూరో/ఖైరతాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానగా ప్రత్యేక గుర్తింపు పొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో శుక్రవారం నుంచి దంత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. నూతనంగా ఏర్పాటుచేసిన దంత వైద్య విభాగాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గురువారం ప్రారంభించారు.
ఈ విభాగం ద్వారా కన్సల్టేషన్తోపాటు దంతాలను శుభ్రం చేయడం, పుచ్చు పళ్లను తొలగించడం, రూట్కెనాల్, క్యాపింగ్ తదితర సేవలను అందించనున్నట్టు అధికారులు తెలిపారు. దీనిని స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్నంబర్ 11లో ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు.
ఈ డెంటల్ క్లినిక్ ఓపీ సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మీభాస్కర్, డాక్టర్ కృష్ణారెడ్డి, అసోసియేట్ డీన్ డాక్టర్ సాయిసతీశ్, డాక్టర్ సాయిబాబా, దంత వైద్యులు డాక్టర్ మహ్మద్ ఖ్వాజా మొయినుద్దీన్, ఏపీఆర్వో ఆశారాణి తదితరులు పాల్గొన్నారు.