మోటకొండూరు, మే 22 : దళితబంధు పథకం దళితుల జీవిత బంధు అని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో ఆదివా రం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టడంతో నాడు కూలీలుగా ఉన్నవారంతా నేడు వ్యాపారులుగా ఎదుగుతున్నారని తెలిపారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ విడుతల వారీగా అందరికి అమలు చేస్తారనే నమ్మకం తమకున్నదన్నారు. దళితుల్లో అట్టడుగున ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు.