ఉస్మానియా యూనివర్సిటీ/ఖైరతాబాద్, సెప్టెంబర్ 12: కులగణన డిమాండ్ సామాజిక న్యాయంతో కూడినదని రాజకీయ విశ్లేషకుడు, సామాజికవేత్త ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ తెలిపారు. కేంద్రం కులగణన చేపట్టి దశాబ్దాలుగా వెనుకబాటుకు గురవుతున్న కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘ప్రస్తుతం దే శంలో కులగణన ఆవశ్యకత’ అంశంపై ఏర్పా టు చేసిన కార్యక్రమానికి యోగేంద్రయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో వెనుకబడిన కులాల అభివృద్ధి కోసమే కులగణన డిమాండ్ ముందుకు వచ్చిందని తెలిపా రు. కార్యక్రమంలో ప్రొఫెసర్ చంద్రునాయక్, డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ ప్రభంజన్యాదవ్, డాక్టర్ పరంధాములు, డాక్టర్ కిరణ్గౌడ్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా బీసీలు ఇంకా ముందువరుసలోకి రాకపోవడానికి నాయకత్వ వెనుకబాటే కారణమని యోగేంద్రయాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇతర కులాల కంటే బీసీలే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ నాయకత్వానికి బీసీలు మద్దతు పలికేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లే అగ్రవర్ణాలు రాజ్యాధికారం చలాయిస్తున్నాయని పేర్కొన్నారు.