యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సోమవారం ఢిల్లీ, చండీగఢ్ ఎన్నికల అధికారి శ్రీ వాస్తవ కుటుంబ సమేతంగా దర్శించుకుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉన్నారు.