హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ అవార్డును నోటిఫై చేయాలంటూ ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ డిసెంబర్ 6కి వాయిదా పడింది. కృష్ణా జలాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ 2013లో అవార్డును ప్రకటించగా, దీనిపై పలు అభ్యంతరాలు తెలుపుతూ
ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మంగళవారం జరిగిన విచారణలో అవార్డును నోటిఫై చేయాలని కర్ణాటకతోపాటు మహారాష్ట్ర వాదనలను వినిపించాయి. పిటిషన్లో ఇంప్లీడ్ అయిన తెలంగాణ కూడా గట్టిగా వాదించింది. ఇరురాష్ర్టాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను డిసెంబర్ 6కి వాయిదా వేసింది.