హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను శుక్రవారం కేటాయిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీట్లు కేటాయించి ఆయా వివరాలను అధికారులు మీడియాకు వెల్లడిస్తారు. మొత్తం 1,05,937 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వీరిలో 78,495 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, వీరికి సీట్లు కేటాయిస్తారు. దోస్త్ నోటిఫికేషన్ గత మే 11న విడుదలైన విషయం తెలిసిందే.