హుజూరాబాద్, అక్టోబర్ 2: దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. వారి ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతున్నది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన రొంటాల సరిత-రవీందర్ దంపతులు ఉన్నత చదువులు చదివారు. గతంలో వీరు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేవారు. ప్రశాంతంగా సాగుతున్న వీరి కుటుంబాన్ని విధి పగబట్టింది. రవీందర్కు పక్షవాతం రావడంతో చేయి, నోరు పడిపోయింది. ఓవైపు భర్తకు చికిత్స చేయిస్తూనే, కుటుంబాన్ని పోషించేందుకు సరిత పెట్రోల్ బంక్లో పనికి కుదిరారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఈ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఆనందాన్ని తెచ్చిపెట్టింది. పథకంలో భాగంగా సరిత కారు ను ఎంపిక చేసుకున్నారు. శనివారం ఎర్టిగా కారు వీరి ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కారు ద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటానని సరిత తెలిపారు.
కష్టకాలంలో మా కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. నా భర్తకు వికలాంగుల పింఛన్ ఇస్తున్నారు. కుటుంబ పోషణకు నేను పెట్రోల్ బంక్లో పని చేస్తున్న. దళితబంధులో భాగంగా నాకు వచ్చిన కారును లీజుకు ఇచ్చి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంట. సీఎం కేసీఆర్ మా కుటుంబానికి దారి చూపిన దేవుడు. మాలాంటి పేదల కోసం దళితబంధు పెట్టిన కేసీఆర్ వెంటే ఉంటం. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కే ఓటేస్తా.
–రొంటాల సరిత, దళితబంధు లబ్ధిదారు