హైదరాబాద్, డిసెంబర్14(నమస్తే తెలంగాణ) : దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీ(ఎఎఫ్ఎ)లో ఈ నెల 17న 212 ఆఫీసర్స్ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) నిర్వహిస్తారు. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫె్లైట్ క్యాడెట్ల ప్రీ-కమిషనింగ్ శిక్షణ విజయవంతానికి గుర్తుగా ఈ పరేడ్ ఏర్పాటు చేశారు.
దీనికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఆర్వో గ్రాడ్యుయేటింగ్ ట్రైనీలకు ‘ప్రెసిడెంట్స్ కమిషన్’ని అందజేస్తారు. ఫె్లైట్ క్యాడెట్లు, ఇండియన్ నేవీకి, ఇండియన్ కోస్ట్ గార్డ్కు, దేశ,విదేశీ అధికారులకు ‘వింగ్స్’ ‘బ్రెవెట్స్’ అందజేయనున్నారు.